మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని మృత దేహాన్ని గుర్తించారు.
మృతదేహంపై ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపైన తెలుపు, నలుపు రంగు పొడుగు గీతల ఫుల్ షర్టు బూడిద రంగు కాటన్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. బోడ గుండుగా ఉన్నాడని, ఎడమ పిరుదు పై ఒక పుట్టుమచ్చ కలిగి, బక్కగా ఉన్నాడని, హిందూ మతస్తుడై ఉంటాడని రైల్వే ఎస్ఐ మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ కు కింద ఇవ్వబడిన 9701112343, 8328512176 సెల్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






