సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️ దుర్గా ప్రసాద్
ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు…
స్థానిక ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి వెంటనే రోడ్ల పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ సారపాక లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సారపాక ప్రధాన కూడలి నుంచి రెడ్డిపాలెం వెళ్లే దారిలో పెట్రోల్ బంకు వద్ద మరియు మసీదు రోడ్డు గ్యాస్ గుడౌన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ…, బూర్గంపాడు మండల పరిధిలోని మరీ ముఖ్యంగా సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్నీ బీటీ రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, తాత్కాలిక మరమ్మత్తులతో కంటి తుడుపు చర్యలు చేయడం కాదు శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేయకపోతే ప్రజలు త్వరలోనే మిమ్మల్ని గద్దె దింపటం ఖాయం అన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొత్త రోడ్లను నిర్మించాలని హెచ్చరించడం జరిగింది. లేనియెడల మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మండల నాయకులు బిఆర్టియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
