Month: July 2025

తెలంగాణ క్రికెట్ క్యాంపుకు ఎంపిక…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే హైదరాబాదులోని ఎమ్మెస్ కే.ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇటీవల యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్ ( వై.ఎస్.సి.ఎల్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్ 14…

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నేరుగా రోగులతో కలిసి ఆసుపత్రిలో లభించే చికిత్స పట్ల ఆరా తీశారు.డ్రగ్ స్టోర్…

బెల్లంపల్లిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి మండలం లోని ఆర్.పీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసారు.…

ప్రభుత్వ విద్యా సంస్థల శితిలావస్తలో ఉన్న భవనాల పరిస్థితి పై ఆందోళన…

తేదీ:27 జూలై 2025,మంచిర్యాల జిల్లా కేంద్రం✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాత బిల్డింగులు శితిలావస్తలో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలలు పెట్టుమని చెబుతుంది కానీ, ప్రభుత్వ విద్యాసంస్థలు శిథిలావస్థలో ఉన్న భవనాలు నిర్మించడం…

కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించి కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.లయన్స్…

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో గ్రేడ్ వన్ ఫోర్ మెన్ గా పనిచేస్తున్న ముళ్ళపూడి రామ్…

(ఐబీ)తాండూరు వార సంతలో వసతులు కరువు.సిపిఐ జిల్లా సమితి సభ్యులు. కొండు బానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ వారసంతకు మంచిర్యాల జిల్లా నుండే కాకుండా కొమరం భీం…

హనుమాన్ బస్తీలో కూలిపోయిన సింగరేణి సబ్ స్టేషన్ గోడ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే పట్టణంలోని హనుమాన్ బస్తి లో గల సింగరేణి సబ్ స్టేషన్ గోడ వర్షానికి కూలింది. దీంతో హనుమాన్ బస్తీ సహ మరికొన్ని ప్రాంతాలలో సింగరేణి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్ స్టేషన్…

నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,నెన్నెల,తేదీ : 26.07.2025✍️ మనోజ్ కుమార్ పాండే. నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సీహెచ్. హనోక్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకునేలో…

” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు – ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ…

నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్ఫ్రెండ్ కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి…

HYD : కార్గిల్ విజయ్ దివస్ – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమరవీరులకు నివాళి…

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు!

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు! పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని…

షుగర్ ఉన్నవారు తిన్న తరువాత 10నిమిషాలు నడవండి… వైద్యులు సలహా…

రోజు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. “ఆహారం తిన్నాక చక్కెర స్థాయులు పెరిగి కొందరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటివారు నడవటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ 30% వరకూ తగ్గించవచ్చు.…

కలెక్టరేట్ కు దిశ సమావేశానికి వచ్చిన పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశానికి పాల్వంచ వచ్చిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ.

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు పాల్వంచ మండలం లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక…

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సైనికుల త్యాగాలకు ప్రతిబింబం “కార్గిల్ దివస్” అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్… దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5,000 MAH బ్యాటరీ 18W…

భారత్ విశ్వసనీయమైన మిత్ర దేశం… – మాల్దీవుల అధ్యక్షుడు

భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత,…

గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.…

TG : భారీ వర్షాలు – రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ…

HYD : లీడర్ శిక్షణ కార్యక్రమంలో MLC కవిత కీలక వ్యాఖ్యలు

నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని MLC కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జాగృతి లాంటి…

కోలా అంజన్ రావు కుటుంబానికి చేయూత అందించిన తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో నిన్న మృతి చెందగా వారి కుటుంబం ఆర్థిక…

ఎరువుల దుకాణాల్లో రెవిన్యూ,పోలీసు,వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని, అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు…

ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా సురేంద్ర మోహన్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్‌ను నియమించింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల…

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్!

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలు, దాడులను నిరోధించేందుకు ములుగు జిల్లా పోలీసులు…

గిరిజన సంక్షేమ వసతీ గృహంలో విద్యార్తినీలతో కలిసి సహపంక్తిగా అల్పాహార తీసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన సంక్షేమ వసతీ గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వంట గదిలోభోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం అల్పాహార సమయంలో హాస్టల్ విద్యార్తినీలతో కలిసి…

చిన్నారుల వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని టేకులు బస్తీ కి చెందిన కృష్ణవేణి కల్యాణ్ దంపతుల ఇద్దరు చిన్నారులు ప్రాణాంతక వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లల చికిత్స కోసం పడారానిపాట్లు పడ్డారు. పూట…

నూతన ఎస్.హెచ్ఓ ను సన్మానించిన మాదిగ హక్కుల దండోరా నాయకులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు ని మాదిగ హక్కుల దండోరా నాయకులు శాలువా కప్పి,పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాదిగ…

టూ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్. కిరణ్ కుమార్ గారు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే శుక్రవారం బెల్లంపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా సీహెచ్. కిరణ్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తప్పి పోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన బ్లూకోట్ సిబ్బంది.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, శుక్రవారం సాయంత్రం ఏఏంసీ ఏరియాలో తప్పిపోయిన బాలున్ని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ బ్లూ కోట్ సిబ్బంది రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్ బాలుని తల్లి తండ్రుల వివరాలను తెలుసుకొని వారికి అప్పగించారు.…

ఎరువులు దుకాణాల తనిఖీ రికార్డు బుక్కులు పరిశీలించిన వ్యవసాయాధికారులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని,అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్…

కలకత్తా లో భారీ వర్షాలు… విమానాశ్రయంలోకి వరద…

భారీ వర్షాలకు కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. ట్యాక్సీ వేలపై నీరు నిలిచింది. ఉత్తర కలకత్తా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…

తిరుపతి: మహిళా కానిస్టేబుల్ మృతి… ఏం జరిగిందంటే…

ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో…

“ఈటింగ్ డిజార్డర్?”.. నిపుణులు ఏమంటున్నారంటే!

ఈటింగ్ డిజార్డర్ ని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా నెర్వోసా’ అని అంటారు. ఇది ఒకరకమైన మానసిక ఆరోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజార్డర్ ఉన్నవారు బరువు పెరిగిపోతామనే భయంతో లేదా అధిక బరువు ఉన్నామని భ్రమపడి, ఆహారం తీసుకోవడాన్ని…

మనిషి ఆరోగ్యానికి పీతలు చేసే మేలు…!

పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.…

మిరియాలు తింటే ఏమవుతుంది?

మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పైపెరిన్ గుణాలు అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుందని వివరించారు. అంతేకాకుండా మిరియాలు అనేవి శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని తెలిపారు. నల్లమిరియాలు సైనస్,…

రేషన్ కార్డుల పంపిణీతో కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటింది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జగన్నాధ పురం లో ఎం.ఎల్.ఏ కూనంనేని తో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణలో పాల్గొన్న కొత్వాల కొత్త రేషన్ కార్డుల పంపిణీతో తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల తనకున్న…

మీ ఆయుర్దాయం పెరగాలంటే రోజు ఎంత దూరం నడవాలి..?

రోజుకు ఏడు వేల అడుగులు నడవడం ద్వారా ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందికి పైగా పాల్గొన్న 57 అధ్యయనాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైందని కథనంలో రాసుకొచ్చింది. రోజుకు…

థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినాలి – ఏం తినకూడదు…

థైరాయిడ్ సమస్య అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. అలాగే పాలు, పెరుగు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, గుడ్లు, చికెన్, ప్రోటీన్ ఎక్కువగా…

ఎండు చేపలు తింటున్నారా…? ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…?

ఎండు చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి…

మునగ కాయలతో జుట్టు పెరుగుదల

మునగ కాయలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ, అలాగే ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి,…

పిల్లలకు smartphone ఇస్తున్నారా… ? జర జాగ్రత్త…! ఇది తెలుసుకోండి..

Snartphone నేడు ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే, 5- 6 స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభించిన 18-24 ఏళ్ల మహిళల్లో 48 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పిల్లల డిజిటల్ అలవాట్లను రూపొందించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.…

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్ కు ప్రయోజనం: ఆర్బీఐ గవర్నర్

భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య…

TG : 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం…

ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు CEC కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా,…

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…

ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారికి సన్మానం

✍️దుర్గా ప్రసాద్ ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో ,KTPS- VII స్టేజ్ ,గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,12/07/2025 నాడు జరిగిన…

పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ గారిని కలిసి భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 24వ తారీఖు కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్ లో జరిగిన మహాగర్జన సన్నాహక సదస్సుకు హాజరైన పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ నీ మర్యాదపూర్వకంగా కలిసిన యువతరం పార్టీ నాయకులు, మందకృష్ణ…

26న కొత్తగూడెం కలెక్టరేట్ లో దిశ కమిటి సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ 26న దిశ కమిటి సమావేశంఈనెల 26న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి…

తురుబాక బ్రిడ్జి పనులు మరియు తాత్కాలిక రోడ్ ను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ దుమ్ముగూడెం మండలం, తురుబాక గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు తాత్కాలిక రోడ్ కుంగి పోయిందని సోషల్ మీడియా లో వచ్చిన సందర్భంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

పోలీసుల ఎదుట లొంగిపోయిన 51మంది మావోయిస్టులు…

✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో…

BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని శ్రీ చంద్రశేఖర్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన BJP నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) శ్రీ చంద్రశేఖర్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాళ్ల సోమసుందర్,…