కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేయాలని సూచించారు.

వారానికి ఒకరోజు ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకోని నిర్ణయం ఆయన తీసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.