సంఘటనలు

1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.

1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.

1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.

1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.

1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.

1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.

2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

జననాలు

1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)

1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.

1923: టీ.ఎం.సౌందర రాజన్ , గాయకుడు, సంగీత దర్శకుడు, (మ.2013)

1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

మరణాలు

1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)

1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.

1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)

2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)

2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.

2022: అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964)

పండుగలు, జాతీయ దినాలు

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం.

సెంట్రల్ ఎక్సైజ్ దినం.