సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్స్ క్యారమ్స్​లో  సహసెరా రెడ్డి, సాహిల్ పట్టాని గోల్డ్ మెడల్స్ గెలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సహసెరా రెడ్డి అండర్-14 గర్ల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన సాహిల్ పట్టాని అండర్-18 బాయ్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. విజ్ఞాన్స్ బో ట్రీ స్కూల్ జట్టు అండర్-12 బాయ్స్  ట్రోఫీ సాధించింది. స్విమ్మింగ్ లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శివాని కర్రా అండర్ 14 గర్ల్స్ 100 మీటర్ల బటర్‌ఫ్లై స్ట్రోక్‌లో స్వర్ణం నెగ్గింది. అండర్ -18 బాయ్స్ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ టైటిల్ గెలిచింది.

©️ VIL Media Pvt Ltd.