రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 9న RTC బస్సుల్లో 54.62 లక్షలమంది ప్రయాణించారు. రూ.24.24 కోట్ల ఆదాయం RTC ఖాతాలో పడింది. ఆక్యుపెన్సీ రేషియో(OR) ఏకంగా 107.04 శాతంగా నమోదైంది.

గడిచిన నెలరోజుల వ్యవధిలో అత్యధిక OR ఇదే. అన్ని డిపోల్లోని బస్సులు 34.58 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఒక్కో బస్సు సగటున 378కి.మీ దూరం ప్రయాణించి రూ.26,526 చొప్పున ఆదాయాన్ని తీసుకువచ్చింది.