హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హై స్పీడ్ రైలు కారిడార్ ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది.