తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో 41- 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.