మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
తేదీ:18 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు దుర్వినియోగం చేశారని, వేసవి శిబిరం కోసం వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మంచిర్యాల పోలీస్ డిప్యూటీ కమిషనర్ భాస్కర్ కు మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, క్రీడాకారులకు క్రీడా సామాగ్రి కానీ, వారికి శిక్షణ కార్యక్రమాలు కానీ జరపడం లేదని, నిధులను వారి స్వలాభం కోసం వాడుకుంటున్నారని అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్, జిల్లా కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, కోచ్ లు జాడి శేఖర్, అల్లం గౌతం సభ్యులు మడే రాజేష్,హరీష్ తదితరులు ఉన్నారు.