మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుల్లతో బోనాలను అంగ రంగ వైభవంగా తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి వద్దకు వెళ్లారు. ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.