భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, బక్రీద్, మొహర్రం, పండుగలు మతసామరస్యానికి ప్రతికలు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాత పాల్వంచలో గత పది రోజులుగా నిర్వహించిన ముస్లింల పండుగ కౌడిపీరీల మహోత్సవం ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. పాత పాల్వంచ జండాలబజార్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కొత్వాల ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ …
అన్ని మతాల సారాంశం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ పరోపకారంతో తోటి వారికి సహాయపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న,కౌడిపీరీల ఉత్సవాల నిర్వాహకులు బాబుమీయ, అజ్మత్ అలీ, యాకుబ్ అలీ, గుమ్ష వలి, జాకీర్, హఫీజ్, రహమత్ అలీ, యాసిన్ పాషా, మౌలాలి, పిల్లల ఆదినారాయణ, యాదయ్య, జానీ, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.