మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం
✍️శివ కుమార్ గౌడ్

మాసాయిపేట మండలం హకీంపేట శివారులోని పౌల్ట్రీ ఇండస్ట్రీని అధికారుల బృందం బుధవారం తనిఖీ చేపట్టింది.

ఫౌల్ట్రీ ఇండస్ట్రీలో యూరియా వినియోగం ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు చేశారు. మాసాయిపేట తహశీల్దార్ జ్ఞాన జ్యోతి, వెల్దుర్తి ఎస్ఐ రాజు, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి యూరియా వాడకం చేయడం లేదని నిర్ధారించారు. తనిఖీలో దన్ సింగ్ పాల్గొన్నారు.