జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా కూతురు సంగీత, భర్తతో కలిసి కన్నతల్లి లక్ష్మిని గొంతునులిమి హత్య చేశారు.

తల్లి ఇచ్చిన బంగారం, భూమి సరిపోదని మిగిలిన ఆస్తి కోసం గొడవ జరిగింది. లక్ష్మి ఒప్పుకోకపోవడంతో ప్లాన్ వేసి నిద్రలోనే చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.