తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన నిధులు సమకూర్చటంతో పాటు భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఖర్చు తగ్గించేలా ఉండాలని సూచించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దానికి అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్లను మరోసారి సమీక్షించాలని కోరారు.
హైదరాబాద్ చుట్టూ 362 కిమీ రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేస్తే మహానగర అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. వికారాబాద్–కృష్ణా, గద్వాల–డోర్నకల్, భూపాలపల్లి–వరంగల్ లైన్లను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. కాజీపేట జంక్షన్లో ఆధునిక సదుపాయాలు కల్పించాలని, వరంగల్తో పాటు హైదరాబాద్ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
