భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
సింగరేణి సెప్టెంబర్ 01,2025
✍️దుర్గా ప్రసాద్
సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఈ అండ్ ఎం గా నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ… సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో ఈ అండ్ ఎం శాఖ ఎంతో కీలకమైన పాత్ర కలిగి ఉందని, ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ పూర్తి పని గంటలు యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్, థర్మల్ ప్రాజెక్టులతోపాటు ఇతర రంగాల్లోకి విస్తరిస్తోందని, ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు.తనపై నమ్మకం ఉంచి సంస్థలో ఉన్నత స్థానానికి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి మోకాళ్ల తిరుమలరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సంస్థ లక్ష్యాలకు కట్టుబడి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు తమ శాఖ సమర్థంగా పనిచేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా గిరిజనుల్లోని కోయ తెగ కు చెందిన అధికారికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
