వివిధ పథకాల ద్వారా పేదల జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

’78 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం. 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సాయం చేశాం. 4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించాం. స్కిల్ ఇండియా మిషన్తో 1.40 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చాం’ అని వెల్లడించారు.