చింత పండు గింజల వల్ల చాలా లాభాలు ఉంటాయి.

వీటి వల్ల కలిగే మేలు పరిశీలిస్తే…

చింత గింజలలో క్యాల్షియం మరియు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా, పుష్టిగా అవుతాయి. వీటి వల్ల కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గుతాయి.

వీటిపై ఉండే టానిన్ చర్మం పై కలిగే ఇన్ఫెక్షన్లను కట్టడి చేస్తాయి. వెన్ను నొప్పి కి చింత గింజల పొడిని తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిపోతుంది.

ఇవే కాకుండా మహిళలలో రక్తహీనతను తగ్గించి, క్యాల్షియం మోతాదును తగ్గకుండా అదుపు చేస్తుంది.

వీటిని వేపుకుని లేదా పొడి చేసుకుని కూడా వాడవచ్చు.