తెలంగాణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు.. ఆ దిశలో తొలి అడుగు వేస్తోంది. ఫిలిప్పీన్స్ కు ముడిబియ్యం ఎగుమతి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.
ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ అంగీకరించింది. రాష్ట్రానికి ఈ మేరకు డిమాండ్ లేఖను పంపింది.