తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు.

“రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది.దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అన్నదాతలకు రుణమాఫీ చేశాం… ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం”అని తెలిపారు.