మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఆలయం లో పూజలు, అభిషేకాలు చేయడం పట్ల బెల్లంపల్లి పట్టణ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులను అకారణంగా అరెస్టు చేయడం అన్యాయమని హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
అరెస్టు అయిన వారిలో జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రేవెళ్లి రాజలింగు, జిల్లా భజరంగ్ సహ సంయోజక్ ఐమూడి మురళీ మనోహర్, కంచి వేణు, పెట్టెం అశోక్, సిరికొండ మోహన్, దాసరి సతీష్, నితిన్ రాజు, సుజన్ కుమార్, శ్రీకాంత్, విలాస్ గౌడ్ ఉన్నారు. వారిని అరెస్టు చేసి తదుపరి సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
