మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు కలెక్టరేట్ రోడ్లో గల టి.ఎన్.జి.హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి కార్యవర్గం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ప్రోత్సహించే పర్యావరణహితమైన బంకమట్టి వినాయకున్ని అందజేసి చవితి పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు.

అనంతరం కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మట్టి వినాయకుని పోస్టర్లు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభుత్వ “వాల్టా ” చట్టం అథారిటీ సభ్యుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి సైండ్ల మొండయ్య, నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు రావు, బొడ్డు శ్రవణ్, సునీత, గోపాల్, రాంకుమార్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

error: -