మంచిర్యాల జిల్లా,
జైపూర్,
తేదీ:11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్

మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి.

వన మహోత్సవంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ…

ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు,పెళ్లి రోజు వంటి సందర్భాల్లో విరివి గా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ వాతావరణ సమ తుల్యతకు పాటుపడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీటీ సంతోష్, ఏపీఓ బి.బాలయ్య , ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, ఐసీడీఎస్ కవిత, సూపర్ వైజర్, బి.ఉదయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ లు, ప్రజలు పాల్గొన్నారు.

error: -