మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:27 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

హైదరాబాదులోని ఎమ్మెస్ కే.ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇటీవల యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్ ( వై.ఎస్.సి.ఎల్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్ 14 విభాగంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన రెడ్డి రిత్విక్ ఎంపికైనాడు.

ఈ ఎంపిక పోటీలలో తెలంగాణ,ఆంధ్ర, కర్ణాటక,కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపిక పోటీలలో రెడ్డి రిత్విక్ మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ క్రికెట్ క్యాంపుకు ఎంపిక అయ్యాడు. క్రికెట్ క్యాంపుకు రిత్విక్ ఎంపిక కావడంతో మూడు సంవత్సరాల పాటు స్పాన్సర్స్ షిప్ లభిస్తుంది.ఈ క్రికెట్ క్యాంపుకు ఎంపిక కావడం పట్ల రెడ్డి రిత్విక్ ను పలువురు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.