మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆదేశాల మేరకు ఈ రోజు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు కమిషనర్ టి.రమేష్.
ఈ సందర్శనలో భాగంగా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను సమీక్షించి, ప్రస్తుత సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ టి.రమేష్ మాట్లాడుతూ…
విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు నాణ్యతతో అందుబాటులో ఉండేలా హాస్టల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, అభ్యాసానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా వారిలో ఆత్మీయతను పెంపొందించే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ టి. రమేష్, డిప్యూటీ ఇంజనీర్ బి. సాయి కిరణ్, టౌన్ ప్లానింగ్ అధికారి యస్. చంద్రశేఖర్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ జి.సునీల్ పాల్గొన్నారు.
