మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:03 ఆగస్టు 25,
✍️ మనోజ్ కుమార్ పాండే,
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE) పిజి మరియు డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 లో పీజీ లేదా డిగ్రీ చేసేందుకుగాను ఈనెల 11వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలో అన్ని సబ్జెక్టులలో చదివేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే ఓపెన్ డిగ్రీలో బిఏ, బీకాం, బీఎస్సీ అన్ని కోర్సులలో అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. దూరవిద్య ద్వారా పీజీ లేదా డిగ్రీ చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీజీ చేసేందుకు స్టడీ సెంటర్ కోడ్ నెంబర్-770 ద్వారా, మరియు డిగ్రీ చదివేందుకు స్టడీ సెంటర్ కోడ్ నెంబర్-043 ద్వారా ఆన్లైన్ లో www.sdlceku.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని ప్రింట్ అవుట్ కు సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి 2 సెట్లు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య స్టడీ సెంటర్లో అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ కోరారు.
వివరాలకు 9959269975 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
