మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు.

అన్నదాన కార్యక్రమం ప్రతి ఆదివారం కొనసాగించాలనే ఉద్దేశంతో 4 ఏప్రిల్ 2020 న ప్రారంభించబడి దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తూ ఈరోజు ఆకలితో అలమటించే వారి ఆకలి తీరుస్తూ, బెల్లంపల్లి పట్టణంలో 340 వ వారము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు స్వర్గీయ తడక దినేష్ కుమార్ జ్ఞాపకార్థంగా వారి స్నేహితులు సహకారంతో స్నేహితుల దినోత్సవ సందర్బంగా అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశారు. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 340వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమం లో వారి మిత్రులు గాజర్ల భీమ్, తడక ప్రశాంత్, బొద్దున చంటి, ఆరెపల్లి శేశి కుమార్, కె.సందిప్అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, గన్నెవరం తిరుమల చారి, సిద్దమల్ల రఘు, మాటూరి వర ప్రసాద్, ఎండీ.యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి పాల్గొన్నారు.