జాడి పుష్ప దంపతులు పోలీసులకు లొంగిపోవాలని కోరిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్…..
మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
✍️మనోజ్ పాండే
మావోయిస్టు లు అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో నుండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న జాడి పుష్ప, జాడి వెంకటి దంపతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా జాడి పుష్ప తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగయ్యతో మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జాడి పుష్ప, జాడి వెంకటి దంపతులిద్దరూ ఇంటికి తిరిగివచ్చి ప్రభుత్వం ఎదుట లొంగిపోవాలని సూచించారు.
వీరిద్దరూ లొంగిపోయి కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మావోయిస్టులు లొంగి పోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. వీరు లొంగి పోయి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఐ హనోక్ అన్నారు.
