భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం.
✍️దుర్గా ప్రసాద్

చర్ల మండలం ఎంపీడీవో ఆఫీస్ పక్కన రైతు వేదిక వద్ద ‌కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి పధకం క్రింద పేద ఇంటి ఆడబిడ్డ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసిన ఈ పధకం ద్వారా చర్ల మండలం 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. సంబంధితులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు
ప్రోగ్రామ్ ఇన్చార్జి MD నవాబ్