మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్ళితే…
గత రెండు రోజుల క్రితం తల్లి రాజేశ్వరితో వాగ్వాదం జరగడంతో ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడ్డి మందు తాగాడని వారి బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. అనీల్ నా చావుకు కారణం తల్లి రాజేశ్వరి ఆవడం గ్రామానికి చెందిన తిరుపతి అనే ఇద్దరు వ్యక్తుల వల్లనే ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని, నా చావుకు వారే కారణమని చనిపోయే ముందు తీసిన వీడియో చర్చనీయాంశం అయిఈ విషయంపై బంధువులు స్పందించి గురువారం శవంతో ఆవడం గ్రామంలో తిరుపతి ఇంటి ముందు ఆందోళలనకు దిగారు. ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళనకారులు విరమించలేదు. చివరకు కొంతమంది పెద్ద మనుషులు బాధిత కుటుంబంతో మరియు తిరుపతి కుటుంబంతో చర్చలు జరిపి నష్టపరిహారం ఇప్పిస్తామని ఒప్పుకోవడంతో వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి…
- దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు…
- బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సబ్ కలెక్టర్ మనోజ్ వరప్రసాద్….
- నెన్నెల తహశీల్దార్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన రెవిన్యూ సిబ్బంది.
- గుండె పోటుతో నెన్నెల్ తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని మృతి..
