మంచిర్యాల జిల్లా,
దేవాపూర్,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాధర వాణి(44) అనే మహిళ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే…
వాణి కి 20 ఏళ్ల క్రితం చొప్పరి భూమయ్య అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఒక సంతానం. భూమయ్య మద్యానికి బానిసైనందున, వాణి కుట్టు మిషన్ పని చేసుకుంటూ వొచ్చిన దాంట్లో సర్ది పెట్టుకుంటూ కాలం వెల్లదీసింది. పూట గడవని పరిస్థితి దాపురిస్తుండడంతో కుటుంబ భారం మోయలేక, చివరికి ఆత్మ హత్యే శరణమణి భావించి బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
ఇట్టి విషయమై మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు దేవాపూర్ ఎస్.హెచ్.ఓ, ఏ.గంగారాం ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- కేర్ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
- అడ్వకేట్ శివారెడ్డి కుమారుడు డాక్టర్ అమరేందర్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- భద్రాచలo డివిజన్ పరిధిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మలేరియా డిపార్ట్మెంట్
- ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, శుభం జరగాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
