మంచిర్యాల జిల్లా
నెన్నెల మండలం
✍️మనోజ్ పాండే

నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుపై బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ మాట్లాడుతూ…,

అనిల్ తల్లి దుర్కి రాజేశ్వరికి, అవడం గ్రామానికి చెందిన ముదేపల్లి తిరుపతికి మధ్య అక్రమ సంబంధం ఉందని తెలియడంతో అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. అనిల్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అనిల్ తండ్రి దుర్కి చిన్నబాపు ఫిర్యాదు మేరకు గురువారం నెన్నెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో అనిల్ మరణానికి కారణమైన ఇద్దరు నిందితులు, గంగారం గ్రామానికి చెందిన ముదేపల్లి తిరుపతి, దుర్కి రాజేశ్వరిని శుక్రవారం అరెస్టు చేసి బెల్లంపల్లి కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరిచారు.